సౌందర్య వంద కోట్ల ఆస్తి ఏమైంది? రహస్య వీలునామాలో నమ్మలేని నిజాలు.. కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయేలా...

by Dishafeatures3 |
సౌందర్య వంద కోట్ల ఆస్తి ఏమైంది? రహస్య వీలునామాలో నమ్మలేని నిజాలు.. కుటుంబ సభ్యులే ఆశ్చర్యపోయేలా...
X

దిశ, సినిమా: అందాల తార సౌందర్య కన్నడ కుటుంబంలో పుట్టినా.. తను చేసిన సినిమాలతో తెలుగింటి అమ్మాయి అయిపోయింది. శాండల్ వుడ్ మూవీతోనే అరంగేట్రం చేసినా.. టాలీవుడ్ లోనే వరుస అవకాశాలు అందుకుంది. రెండు దశాబ్దాలకు పైనే స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అటు బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ పక్కన నటించిన ఆమె.. అక్కడ వరుస అవకాశాలు వచ్చినా కాదనుకుంది. సౌత్ ఇండస్ట్రీకే ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇక వయసు పెరగడం, కొత్త వాళ్లు రావడంతో అవకాశాలు తగ్గిపోగా.. పెళ్లి చేసుకుని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రచారానికి వెళ్తూ విమాన ప్రమాదంలో చనిపోయింది.

అయితే సౌందర్య చిన్న వయసులోనే మరణిస్తుందని ముందే తన తండ్రి జాతకం చెప్పడంతో రహస్యంగా వీలునామా రాసి పెట్టిందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. కానీ కుటుంబ సభ్యులకు కాకుండా ఎక్కువ మొత్తంలో అనాథ శరణాలయాలకు ఆస్తి రాయడంతో దాన్ని లేకుండా చేసి.. భర్త, తల్లి పంచుకున్నారని ప్రచారం జరుగుతుంది. కాగా దీనిపై స్పందించిన సౌందర్య భర్త.. అలాంటిదేమీ లేదని, ఇదంతా అవాస్తవమని కొట్టిపారేసినట్లు సమాచారం.

Next Story

Most Viewed